Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 200 కేజీల గంజాయి, లారీ స్వాధీనం
- పరారీలో ఇద్దరు నిందితులు
నవతెలంగాణ- మల్కాజిగిరి
గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను హైదరాబాద్ ఎల్బీనగర్ ఎస్వోటి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. దీనికి సంబంధించిన వివ రాలను రాచకొండ సీపీ మహేశ్ భగవత్ బుధవారం మీడి యా సమావేశంలో వెల్లడించారు. రాజస్థాన్కు చెందిన దేవేందర్ సింగ్, యూపీకి చెందిన రవీంద్ర కుమార్, ఆగ్రా కు చెందిన యాదవ్ వీరు ముగ్గురు స్నేహితులు. ఈజీగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో విశాఖపట్నం అరకు ప్రాంతానికి చెందిన హరి ద్వారా తక్కువ ధరకు గంజాయి కొని, వివిధ రాష్ట్రాల్లో సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లోని అరకు నుంచి హైదరాబాద్ మీదుగా గంజాయిని లారీ కంటైనర్లో తరలిస్తున్నారన్న సమాచా రం మేరకు ఔటర్ రింగ్ రోడ్డు వద్ద పోలీసులు నిఘా పెట్టారు. ఉత్తరప్రదేశ్కు గంజాయిని తరలిస్తున్న ముఠాలో ని ఇద్దరిని అరెస్టు చేశారు. వారి నుంచి 200 కేజీల గంజాయి, లారీ, 15 వేల నగదు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువు మొత్తం రూ. 40 లక్షల 50 వేలు ఉంటుంది. లారీలో ప్రత్యేక క్యాబిన్ తయా రు చేసి అందులో గంజాయిని తరలిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని సీపీ తెలిపారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నట్టు చెప్పారు.