Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకనట విడుదల చేశారు. అంటరానితనం, కులవివక్ష, అసమానతలకు వ్యతిరేకంగా జీవితాంతం పోరాడిన మహ నీయులు అంబేద్కర్ అని కొనియాడారు. అతిపెద్ద ప్రజా స్వామ్య దేశానికి రాజ్యాంగాన్ని రాసి బడుగు వర్గాల వారికి విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు ప్రసాది ంచిన ఘనత అంబేద్కర్కే దక్కిందని తెలిపారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ బడ్జెట్లో ఎస్సీల సంక్షేమానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించారనీ, ఎస్సీ సబ్ప్లాన్ నిధులను సక్రమంగా వినియోగిస్తూ వారి అభివ ద్ధికి రాష్ట్ర ప్రభుత్వం దోహదపడుతుందని పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల సంక్షేమం కోసం రెసిడెన్షియల్ స్కూల్స్ ద్వారా మెరుగైన విద్యను అంది స్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. నేటి తరం యువత అంబేద్కర్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ఆయ న ఆశయాలకు అనుగుణంగా నడుచుకుని ఎంచుకున్న ఆయా రంగాల్లో ఎదగాలని ఆశాభావం వ్యక్తం చేశారు.