Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
దాహర్తీని తీర్చుకోవడానికి చలివేంద్రాలను ఉపయోగి ంచుకోవాలనీ, ఆహారం నీటి వద్ద తేడాలు ఏమీ ఉండవని వెంకటేశ్వర కాలనీ డివిజన్ కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి అన్నారు. బుధవారం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14 లోని టీఎస్ స్టడీ సర్కిల్ వద్ద పలువురు స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఏర్పాటు చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ యువ నాయకుడు సాయి నాయుడు, టీఆర్ఎస్ ముఖ్య నాయకులు తదితరులు భాగ స్వాములయ్యారు. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద ఉన్న నిరుపేద రోగుల సహాయకుల చలివేంద్రాలతోపాటు ఎవరైనా స్వచ్ఛంద సంస్థలు పని చేయాలనుకున్నా వివిధ రకాల తినుబండారాలను చలివేంద్రం వద్ద నుంచి పంపిణీ చేయవచ్చని మజ్జిగ ప్యాకెట్లు కూడా ఆమె పంపిణీ చేశారు.