Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుల్తాన్బజార్
వేసవి కాలంలోఅగ్ని ప్రమాదాల పట్ల ప్రజలు అప్రమ త్తంగా ఉండాలని సాలార్జంగ్ మ్యూజియం అగ్నిమాపక కేంద్రం ఫైర్ ఆఫీసర్ అనిల్కుమార్ అన్నారు. సాలార్ జంగ్ మ్యూజియం అగ్నిమాపక కేంద్రం ఆధ్వర్యంలో బుధవారం మహాత్మా గాంధీ బస్స్టేషన్ (ఎంజీబీఎస్) లో ప్రజలు, ఆర్టీసీ డ్రైవర్లు, కార్మికులకు అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఫైర్ ఆఫీసర్ అనిల్కుమార్ మాట్లాడుతూ అగ్నిమాపక వారోత్సవాలు ఈ నెల 20వ తేదీ వరకు కొనసాగుతాయన్నారు. వ్యాపార సముదాయాల్లో ఫైర్ సేఫ్టీ పరికరాలు కలిగి ఉండాలని పేర్కొన్నారు. లక్షలాదిగా పెట్టుబడి పెట్టి వ్యాపారాన్ని చేస్తున్న వ్యాపారులు ఫైర్ సేఫ్టీపై ప్రత్యేక శ్రద్ధ వహించాల న్నారు. గృహం, వ్యాపార సముదాయాల్లో ఫైర్ సేఫ్టీ మిషన్ (ఫైర్ ఎక్స్ స్టష విషర్ పరికరం) ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు. అగ్ని ప్రమాదాలు జరిగితే మూడు నిమిషాల్లోనే మంటలను అదుపులోకి తీసుకు రావాలని సూచించారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనంతరం ప్రజలకు కరపత్రాలను అందిస్తూ జాగ్రత్తలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎండీ.తాహెర్అలీ, రమణ, జీఎస్.రెడ్డి, ఓం ప్రకాష్, శ్రీనివాస్, వెంకట్రెడ్డి, దినేష్, తదితరులు పాల్గొన్నారు.