Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
మద్యం కోసం పోలీస్ సైరన్తో కారులో వచ్చిన ఓ వ్యక్తి గన్ చూపించి హల్చల్ చేశాడు. ఈ సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం ఎల్లమ్మబండ మహంకాళీనగర్కు చెందిన దిలీప్ పవర్ మంగళవారం రాత్రి 10:30 సమయంలో శ్రీలాస్య వైన్స్ వద్ద గల పాన్షాపులో సిగరేట్ కొనుగోలు చేశారు. అ తరువాత తనకు తెలిసిన వ్యక్తి జాన్సన్ కనిపించడంతో మాట్లాడుతూ ఉన్నాడు. అదే సమయంలో ఆల్వీన్కాలనీకి చెందిన హరీష్ అనే వ్యక్తి కారులో మద్యం కోసం పోలీస్ సైరన్తో లాస్య వైన్స్ వద్ద అపి కిందకు దిగాడు. దీంతో దిలీప్ పవర్ సైరన్ ఎందుకు వేశావని అడుగడంతో తాను రాజకీయ నాయకుడి కొడుకునని నా ఇష్టం అనడంతో ఇద్దరి మధ్య చిన్న వాగ్వాదం జరిగింది. దీంతో కారులో ఉన్న గన్ను తీసుకుని చంపుతానని బెదిరించాడు. ప్రజలు గుమికూడడంతో పెట్రోలింగ్కు వచ్చిన పోలీసులు గమనించి విషయం తెలుసుకున్నారు. దీంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దిలీప్ పవర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.