Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నారాయణగూడ
రాజ్యాంగం లక్ష్యాలను ఖూనీచేస్తూ మోదీ ప్రభుత్వం రిజర్వేషన్లను అంతం చేయడానికే ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటు పరం చేస్తుందని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నక్క రాజేందర్ ఆరోపించారు. బుధవారం రాష్ట్ర కార్యాలయంలో భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ భీంరావు అంబేద్కర్ 130వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా అంబేద్కర్ చిత్రపటానికి ఫూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించి, రాజ్యాంగ పరిరక్షణ దినంగా పాటించారు. అనంతరం అయన మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్, సంఫ్ు పరివార్ శక్తులు ఎల్లప్పుడూ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్నాయని, ఆనాడు దళితుల అభ్యున్నతి కోసం పార్లమెంట్ లో రిజర్వేషన్ల బిల్లు ప్రవేశ పెడుతుంటే పార్లమెంట్ బయట వారు అంబేద్కర్ దిష్టిబొమ్మను తగులబెట్టారని గుర్తు చేశారు. దళిత, బహుజనుల సాంఘిక, ఆర్థిక అభ్యున్నతికి అంబేద్కర్ సాధించిన రిజర్వేషన్లను తొలగించడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న 'చెడు కుట్ర' అడ్డుకుంటామని అయన పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వ క్రూరమైన దాడులను ఎదుర్కోవడానికి పెద్దఎత్తున మిలిటెంట్ పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.