Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్పేట
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్కు అవమానం జరుగుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, మాజీ ఎంపీ అజీజ్పాష అన్నారు. పంజాగుట్ట చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మాజీ రాజ్యసభ సభ్యులు, కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంతరావు మూడు రోజులుగా చేస్తున్న ఆమరణ నిరహార దీక్షకు వారు బుధవారం సంఘీభావం ప్రకటించారు. రాజ్యాంగ నిర్మాతకే అవమానం జరిగితే సామాన్యుల పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోచ్చు అన్నారు. పంజాగుట్ట చౌరస్తాలో అంబేద్కర్ విహ్రాన్ని ఏర్పాటు చేయాలని ధర్నాలు, ఆమరణ నిరహార దీక్షలు చేపట్టినా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణం అన్నారు. వీహెచ్ న్యాయమైన డిమాండ్కు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.