Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎల్బీనగర్
దేశాన్ని పాలిస్తున్న నాయకులు రాజ్యాంగాన్ని విచ్ఛినం చేయడానికి ప్రయత్నిస్తున్నారని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన కర్తవ్యం కార్మికులు, రైతులు, దళిత బహుజనులపై ఉందని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కీసరి నర్సిరెడ్డి, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు భీమనపల్లి కనకయ్య అన్నారు. బుధవారం ఎల్బీనగర్లో సీఐటీయూ, అంబేద్కర్ ఆటో డ్రైవర్స్ డ్రైవర్స్ యూనియన్, కార్మిక సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత కార్మిక, కర్షక, విద్యార్థి, యువజన మహిళలపై ఉందన్నారు. పాలకులు పేద, దళిత వ్యతిరేక విధానాలను మానుకోవాలని ప్రభుత్వ రంగాన్ని కాపాడాలన్నారు. కార్యక్రమంలో ఎల్బీ నగర్ సర్కిల్ సీఐటీయూ కన్వీనర్ ఆలేటి ఎల్లయ్య, నాయకులు సీహెచ్ వెంకన్న, ఆటో యూనియన్ నాయకులు ఊహుదారి రమేష్, జంగయ్య, లక్ష్మణ్, నరేష్ సత్యనారాయణ, తిరుపతి, నక్క యాదయ్య, పాండు తదితరులు పాల్గొన్నారు.