Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోడుప్పల్
సామాజిక బానిసత్వం రూపుమాపాలంటే చదువొక్కటే ఏకైక మార్గమని బలంగా విశ్వసించిన మహనీయుడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. బుధవారం బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలోని అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన భీమ్రావు అంబేద్కర్ 130జయంతి వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసమానతలు లేని సమసమాజ స్థాపన కోసం అంబేద్కర్ చేసిన కృషి అమోఘమైందన్నారు. అణగారిన వర్గాలకు భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించి ప్రజలకు అనేక రకాల హక్కులను అందించిన మహనీయుడు అని కొనియాడారు. అంబేద్కర్ సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాపోలు రాములు మాట్లాడుతూ దేశంలోని కుల, మతాలకు అతీతంగా వయోజనులందరికీ ఓటు హక్కు కల్పించిన ఘనత అంబేద్కర్కే దక్కిందని అన్నారు. అంబేద్కర్ను కేవలం కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితం కాకుండా ఈ దేశంలోని అన్ని వర్గాల వ్యక్తిగా గుర్తుంచుకోవాలని కోరారు. కార్యక్రమంలో నగర మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీగౌడ్, బోడుప్పల్ కార్పొరేషన్ కమిషనర్ బోనగిరి శ్రీనివాస్, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు చినింగిల కుమార్, స్థానిక కార్పొరేటర్ చీరాల నర్సింహ, శుభోధయ సంఘం అధ్యక్షుడు బొమ్మకు విశ్వనాథ్, కార్పొరేషన్ కార్పొరేటర్లు కొత్త చందర్ గౌడ్, బింగి జంగయ్య యాదవ్, సింగిరెడ్డి పద్మారెడ్డి, తోటకూర అజరు యాదవ్, బొమ్మకు సుగుణ, బొమ్మకు కల్యాణ్, కుంభం కిరణ్ కుమార్ రెడ్డి, కొత్త దుర్గమ్మ, పోగుల నర్సింహ రెడ్డి, సామల పవన్ రెడ్డి, సుమన్ నాయక్, దొంతరబోయిన మహేశ్వరి, రాసాల వెంకటేష్ యాదవ్, జక్కా పద్మా రాములు, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి, అంబేద్కర్ యువజన సంఘం ప్రతినిధులు చీరాల జంగయ్య, జంగయ్య పాల్గొన్నారు.