Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(పీడీఎస్యూ) ఆధ్వర్యంలో ఉస్మానియా అరుణతార ప్రగతిశీల విద్యార్థి నాయకుడు జార్జిరెడ్డి 49వ వర్ధంతి సందర్బంగా బుధవారం నారాయణగూడలోని ఆయన సమాధి వద్ద పీడీఎస్యూ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు మామిడికాయల పరుశురామ్ మాట్లాడుతూ జార్జిరెడ్డి నేటి తరం విద్యార్థులకు దిక్సూచి అని, ఆయన కలలు కన్న సమసమాజ స్థాపన కోసం విద్యార్థి, యువత నడుం బిగించి పోరాటాలు చేయాలని కోరారు. ఆనాడు పేద, మధ్యతరగతి విద్యార్థులు యూనివర్సిటీలలో చదువుకోసం వస్తే వారిని ఇబ్బంది పేట్టేవారిని చీల్చిచెండాడే వాడని, నిత్య పేద విద్యార్థుల కష్టా సుఖాల్లో పాలుపంచుకునే జార్జిని ఏప్రిల్ 14న మతోన్మాదులు హత్య చేశారని పేర్కొన్నారు. కానీ ఆయన ఆశాలు నేటికి సజీవంగా ఉన్నాయని, వాటిని ముందుకు తీసుకు పోవడంలో ప్రగతిశీల శక్తులు సమరశీల పోరాటాలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఈ. విజరు కన్నా, గ్రేటర్ హైదరాబాద్ ఉపాధ్యక్షులు గణేష్, నాయకులు పాల్గొన్నారు.