Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమానత్వాన్ని కోరుకున్న మహానీయుడు అంబేద్కర్
- రాచకొండ సీపీ మహేష్భగవత్
నవతెలంగాణ-సిటీబ్యూరో
బాబా సాహెబ్ అంబేద్కర్ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని, దళిత, గిరిజన, వెనుకబడిన తరగతుల సంక్షేమం, అభివృద్ధిని, సమానత్వాన్ని కోరుకున్న అంబేద్కర్ ఆశయాలను సాధించడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్భగవత్ తెలిపారు. అంబేద్కర్ ఆశయసాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా బుధవారం రాచకొండ కమిషనరేట్లో అదనపు సీపీ సుదీర్బాబుతో కలిసి సీపీ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళ్లు అర్పించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ అంబేద్కర్ విద్య ద్వారానే వెనుకబాటుతనం సమసిపోతుందని బలంగా నమ్మారని గుర్తు చేశారు. సమ సమాజ స్థాపన, దేశాభివృద్ధి కోసం నిరంతరం పాటుపడిన మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని తెలిపారు. అంబేద్కర్ ఒక సామాజిక సంస్కర్త, ఆర్థిక వేత్త, ఆలోచనాపరుడుని కొనియాడారు. అవమానాలు, పోరాటాల మధ్య పెరిగిన అంబేద్కర్ జర్మనీలోని విశ్వవిద్యాలయాల్లో చదువుకున్నారని తెలిపారు. అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాటం చేశారన్నారు. స్వతంత్ర భారతదేశపు మొదటి న్యాయ మంత్రిగా పనిచేశారని గుర్తు చేశారు. అంబేద్కర్ జీవితం, అతని ప్రయత్నాలు, తన పూస్తకాల ద్వారా చేసిన ఆయన బోదనలు నేటికీ మనల్ని ప్రేరేపిస్తాయన్నారు. అంబేద్కర్ లాంటి గొప్పనాయకున్ని కేవలం షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారిగా చూడవద్దని అదనపు సీపీ సుదీర్బాబు కోరారు. బుగుడుబలహీన వార్గల అభివృద్ధి కోసం అంబేద్కర్ జీవితాంతం పోరాడారని తెలిపారు. అందరికీ మానత్వం స్వేచ్ఛ, న్యాయం కోసం పాటుబడిన మహౌన్నతుడని కొనియాడారు. భారత రాజ్యాంగం ద్వారా ప్రపంచంలో అనేక దేశాలకు ఒక ఉదాహరణలిచ్చాడని తెలిపారు. మహిళల పురోగతి కోసం పాటుపడ్డారన్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యాక్రమంలో డీసీపీ (అడ్మిన్) శిల్పవల్లి, సురేందర్రెడ్డితోపాటు హయత్నగర్ సీఐ సురేందర్, ఆర్ఐ నాగరాజు రెడ్డి, రామారావుతోపాటు పలువురు పాల్గొన్నారు.