Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
అంబేద్కర్ దూరదష్టిగల గొప్ప మహానీయుడు, విద్యావేత్త అని, ఆయన రాసిన రాజ్యాంగం వల్లే నేడు దేశం దృఢంగా ఉందని, నిజాం కాలేజ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ లక్ష్మీకాంత్ రాథోడ్ అన్నారు. కాలేజీ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బాల్యం నుంచే వివక్షను ఎదుర్కొన్న అంబేద్కర్ ఎంతో ఉన్నతంగా ఎదిగి, రాజ్యాంగాన్ని రాసి అణగారిన వర్గాలు, ప్రజల జీవితాల్లో వెలుగు నింపారన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ అవినాష్ జైస్వాల్, లెక్చరర్లు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.