Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బేగంపేట్
బీజేపీని బలోపేతం చేసేందుకు బన్వర్లాల్ వర్మ ఎంతో కషి చేశారని సనత్నగర్ నియోజకవర్గంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని, ఆయన మృతి చాలా బాధాకరమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి అన్నారు. కొంత కాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న బీజేపీ రాష్ట్ర సహాయ కోశాధికారి, మాజీ కార్పొరేటర్ బన్వర్ లాల్వర్మ శనివారం ఉదయం కిమ్స్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. కిషన్రెడ్డి వర్మభౌతిక కాయంవద్ద నివాళి అర్పించారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. రాంగోపాల్పేట్ కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.