Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
హరిత శుక్రవారం కార్యక్రమంలో భాగంగా దుండిగల్ మునిసిపల్ కమిషనర్ పి.భోగీశ్వర్లు మున్సిపల్ నర్సరీలను సందర్శించారు. భవిష్యత్తులో హరితహారానికి కావలసిన మొక్కలను ముందుగానే పెంచుకోవాలని ఆదేశించారు. అనంతరం స్పెషల్ డ్రైవ్లో భాగంగా పలుచోట్ల పర్యటించి చెత్తను వెంటనే తొలగించాలని ఆదేశించారు. మాస్కులు తప్పక ధరించాలని స్థానికులకు సూచించారు. లేకపోతే రూ. 1000 జరిమానా పడుతుందన్నారు. శానిటరీ ఇన్స్పెక్టర్ కరుణాకర్రెడ్డి, ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ సాత్విక్, సిబ్బంది పాల్గొన్నారు