Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రముఖ సివిల్ సర్జన్, గైనకాలజిస్ట్ డాక్టర్ గాయత్రి
నవతెలంగాణ-నారాయణగూడ
పుణె క్లినికల్ ట్రయల్స్ (ఐసీఎంఆర్) గైడ్ లైన్స్ ప్రకారం సిట్రోబయోషీల్డ్ ముక్కు, గొంతులో స్ప్రే చేయడం ద్వారా ఐదు నిమిషాల వ్యవధిలో కోవిడ్ వైరస్ లోడ్ తగ్గి చనిపోతుందని ప్రముఖ సివిల్ సర్జన్, గైనకాలజిస్ట్ డాక్టర్ గాయత్రి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సిట్రోబయోషీల్డ్ వాడటం వల్ల రోగితో కలిసిన వ్యక్తులకు వైరస్ సోకదన్నారు. దీన్ని గొంతు, ముక్కులో స్ప్రే చేయడం ద్వారా చుట్టు పక్కల ఉన్న వారు సైతం వైరస్ బారిన పడకుండా ఇన్ఫెక్షన్, మరణాల నుంచి బయటపడవచ్చునని తెలిపారు. గతేడాది మార్చి నుంచి నేటి వరకు దేశంలో రెండు వేల మందికి ఈ సిట్రోబయోషీల్డ్ వాడారని, వారందరూ కరోనా వైరస్ వ్యాప్తి చెందడం, మరణాల నుంచి బయటపడ్డారని స్పష్టం చేశారు. ప్రజలకు కరోనా వైరస్, జాగ్రత్తలపై ఉచిత సలహాలు, సూచనలకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 9490439767, 9391370214 ఫోన్ నెంబర్ల ద్వారా తనను సంప్రదించవచ్చునని ఆమె తెలిపారు.