Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బేగంపేట
ఆకలితో అలమటిస్తున్న, పని దొరకక ఇబ్బందులు పడుతూ రోడ్లపై జీవనం కొనసాగిస్తున్న వారికి రాంగోపాల్పేట్ డివిజన్ కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్ ఆహార పొట్లాలను అందజేశారు. ఆదివారం మహంకాళి దేవాలయం వద్ద రోడ్లపై నివసిస్తున్న వారికి ఆహారాన్ని అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాంగోపాల్పేట్ డివిజన్లో చాలామంది ఆహారం దొరకక ఇబ్బందులు పడుతున్నారని, వారికి తన వంతుగా ఆహారాన్ని అందజేస్తానని స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వచ్చి వారిని ఆదుకోవాలని ఆమె కోరారు.