Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్
నవతెలంగాణ-అంబర్పేట
నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని పురపాలక శాఖా ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్కుమార్ను కోరినట్లు అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ తెలిపారు. బుధవారం పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అరవింద్ కుమార్ను మాసబ్ ట్యాంక్లోని ఆయన కార్యాలయంలో కలిసి అభివృద్ధి పనులకు నిధుల మంజూరుపై మాట్లాడారు. అంబర్పేట నియోజకవర్గంలో 7 థీమ్ పార్కులను ఏర్పాటు, రత్నానగర్ నాలాకు వరద నీటి రిటైనింగ్ వాల్ నిర్మాణం, నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఏసీ బస్టాఫ్ల ఏర్పాటు, నారాయణగూడ వైఎంసీఏ, అలీకేఫ్ చౌరస్తా, శివమ్రోడ్డు, ఉస్మానియా, కాచిగూడ రైల్వే స్టేషన్, బర్కత్పుర జంక్షన్లను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం వంటి అంశాలపై చర్చించారు. అలీ కేఫ్ చౌరస్తా నుంచి మూసారాంబాగ్ వరకు హై లెవల్ ఫ్లై ఓవర్ నిర్మాణం కొరకు రూ. 30 కోట్ల నిధులను మంజూరు చేయాలని కోరగా త్వరలోనే నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. ఫ్లై ఓవర్ నిర్మాణం కంటే ముందే అలీ కేఫ్ చౌరస్తా నుండి నాగోల్ వరకు 120 ఫీట్ల రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలన్నారు. నియోజకవర్గంలో కలుషిత తాగు నీటి సమస్య పరిష్కారం, డ్రెయినేజీ వ్యవస్థ ఆధునికీకరణ కోసం 2 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసి పనులు ప్రారంభించాలని కోరినట్లు చెప్పారు.