Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
ప్రజల సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అధికారులను ఆదేశించారు. బుధవారం జీడిమెట్ల డివిజన్ పరిధిలోని జయరాంనగర్లో మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి ముంపు ప్రాంతాల్లో వరదనీరు నిల్వ ఉండడంతో సమస్యపై జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పర్యటించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీ వాసులకు ఇబ్బందులు కలగకుండా మొదటగా భూగర్భ డ్రెయినేజీ నిర్మించాలన్నారు. వర్షపు నీరు నిల్వ ఉండకుండా నాలాను నిర్మించి సమస్య శాశ్వతంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.