Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
రాంపల్లి చౌరస్తా నుంచి బండ్లగూడ వెళ్లే దారిలో సర్వే నంబర్ 574లో ఉన్న చెత్త డంపింగ్ యాడ్ను ఎత్తేయా లని నాగారం మున్సిపల్ పరిధిలోని ఈస్ట్ గాంధీనగర్ కాలనీలోని రెసిడెన్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మున్సిపల్ చైర్మెన్ కౌకుంట్ల చంద్రారెడ్డి, మున్సిపల్ కమిషనర్ వాణికి వినతిపత్రం అందజేశారు .జవహర్నగర్ డంపింగ్ యార్డు నుంచి దుర్వాసన వస్తుండటంతో ప్రతి రోజూ సమీప కాలనీల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మాదిరెడ్డి వెంకట్రెడ్డి, రెసిడెన్ట్స్ వెల్పేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కిష్టరెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రావన్కుమార్, కోశాధికారి రాజు, కార్యవర్గసభ్యులు పాల్గొన్నారు.