Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కూకట్ పల్లి
నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న సమస్యలను సత్వరమే పూర్తి చేయాలని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా పెండింగ్లో ఉన్న పనులను ప్రస్తావించారు. రోడ్లు, డ్రయినేజీ సమస్యలను సత్వరమే పూర్తి చేయాలని, ఏమైనా నిధుల కొరత ఉంటే ప్రణాళికలు సిద్ధం చేసి ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు సంబంధించి మౌలిక సదుపాయాల విషయాల్లో ఎటువంటి రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. అతిత్వరలోనే బాలానగర్ ఫ్లైఓవర్ కూడా అందుబాటులోకి వస్తుందని ఆయన తెలియచేశారు.