Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ
నవతెలంగాణ-కేపీహెచ్బీ
ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. గురువారం హైదర్నగర్ డివిజన్ పరిధిలోని ప్రశాంత్నగర్, ఎస్రాజునగర్ కాలనీల్లో నెలకొన్న డ్రయినేజీ ఔట్లెట్ సమస్యను నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గోపి, కార్పొరేటర్ నార్నే శ్రీనివాస్రావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రయినేజీ ఔట్లెట్ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మెరుగైన రవాణా సౌకర్యం కల్పిస్తామన్నారు. హైదర్నగర్ డివిజన్ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామన్నారు. కార్యక్రమంలో డీఈ గోెవర్ధన్, ఏఈ రాజీవ్, వర్క్ ఇన్స్పెక్టర్ మహదేవ్, గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజ్, మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, నాయకులు గోపాల్రెడ్డి, నాయినేని చంద్రకాంత్, సైదేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.