Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని రంగారెడ్డినగర్ డివిజన్ కార్పొరేటర్ బి.విజరుశేఖర్గౌడ్ అన్నారు. గురువారం డివిజన్ పరిధిలోని వెంకట్రామిరెడ్డినగర్ లో జరుగుతున్న భూగర్భ డ్రయినేజీ పనులను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పనులలో జాప్యం వహించకుండా త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పనుల్లో నాణ్యత లోపిస్తే సహించేది లేదన్నారు. అనంతరం గిరినగర్లో పర్యటించారు. ఆలయ గజ స్తంభానికి విద్యుత్ తీగలు తగిలేలా ఉన్నాయని సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరారు. స్పందించిన ఆయన విద్యుత్ అధికారులను పిలిపించి సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో వెంకట్రామిరెడ్డినగర్ సంక్షేమ సంఘం సభ్యులు, గిరినగర్ వాసులు తదితరులు పాల్గొన్నారు.