Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
నవతెలంగాణ-బేగంపేట
సనత్నగర్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా కృషి చేస్తున్నామని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం బన్సీలాల్పేటలోని పద్మారావునగర్లో సుమారు రూ. 89 లక్షల నిధులతో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు సమస్యలను తన దృష్టికి తీసుకొచ్చిన వెంటనే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అధికారులు సమస్యలపై సకాలంలో స్పందించాలని ఆదేశించారు. రహదారులు, డ్రయినేజీ, పారిశుధ్య నిర్వహణ వంటి అంశాలపై నిరంతర పర్యవేక్షణ చేపడుతున్నామని ఆయన వివరించారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, డీసీ ముకుంద రెడ్డి, ఈఈ శివానంద్, వాటర్ వర్క్స్ జీఎం రమణారెడ్డి, టౌన్ ప్లానింగ్ ఏసీపీ కృష్ణ మోహన్, కార్పొరేటర్ కుర్మ హేమలత, పద్మారావు నగర్ టీఆర్ఎస్ పార్టీ ఇనచార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్, నాయకులు శ్రీకాంత్ రెడ్డి, బాల్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, కుశాల్, కమల్ కుమార్, హరి, ముక్కా శ్రీను, నాగాలక్ష్మి, ఆండాలమ్మ, గజ్జెల శ్రీను, లంబు శ్రీను, లంక రాజు, బాబురావు, శైలేందర్, అబ్బాస్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.