Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ప్రతి బస్తీ, కాలనీల్లో మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. శుక్రవారం చింతల్ డివిజన్ పరిధిలోని రోడామేస్త్రీనగర్లో రూ.10 లక్షలతో నూతనంగా చేపట్టనున్న నాలా కల్వర్టు స్లాబ్, శ్మశానవాటిక కంపౌండ్ వాల్, భూగర్భ డ్రయినేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలం సమీపిస్తుండడంతో ముంపు ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాలాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు మహమ్మద్ రఫీ, ఏఈ సంపత్, నాయకలు వాహిద్, కేపీ వెంకటేష్గౌడ్, బస్వరాజ్, ప్రభాకర్గుప్త, బాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.