Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్ రూరల్
ఐక్యతతో గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని సర్పంచ్ బద్దం గోపాల్ రెడ్డి అన్నారు. ఘట్కేసర్ మండలం ఘణపూర్ గ్రామ పంచాయతీ పాలకవర్గం సాధారణ సమావేశం సర్పంచ్ అధ్యక్షతన శుక్రవారం జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో పూర్తి స్థాయిలో భూగర్భ డ్రయినేజీ, సీసీ రోడ్ల నిర్మాణానికి సభ్యులు చర్చించినట్లు తెలిపారు. దశలవారీగా గ్రామంలో మౌలిక సదుపాయలకు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కార్యదర్శి మధు, ఉపసర్పంచ్ వేముల పరమేశ్వర్ గౌడ్, వార్డు సభ్యులు చిలుగూరి భాస్కర్, వేముల పద్మ, మందుల మయూరి, వడ్త్యా పవన్ నాయక్, వేముల శోభ, వేముల శ్వేత, కో ఆప్షన్ సభ్యులు ఇన్నా రెడ్డి, నానావత్ సురేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.