Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఏఎస్రావు నగర్
నాలుగు రోజుల క్రితం చర్లపల్లి డివిజన్ రెడ్డి కాలనీలో ఇంటిముందు వీధి కుక్క దాడిలో గాయపడ్డ పదో తరగతి విద్యార్థిని జాహ్నవిని జీహెచ్ఎంసీ అధికారి నాయక్ శనివారం చర్లపల్లి కాలనీల సమాఖ్య ప్రతినిధులు, కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు చెప్యాల సురేందర్రెడ్డితో కలిసి పరామర్శించారు. డివిజన్ పరిధిలోని కాలనీల్లో ఉదయం, సాయంత్రం సమయాల్లో వీధి కుక్కలు గుంపులుగా సంచరిస్తాయనీ, వాటిని పట్టుకెళ్లడానికి తమ సిబ్బందిని ఉదయం సమయాల్లోనే పంపిస్తామని అధికారి నాయక్ కాలనీ వాసులతో చెప్పారు. కాప్రా సర్కిల్ చర్లపల్లి డివిజన్ పరిధిలో పందుల సంచారంపై ప్రత్యేకంగా దృష్టి సారించి చర్యలు తీసుకుంటామన్నారు.