Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్పేట
భరత్నగర్ కమ్యూనిటీ హాల్ వెనుక భాగంలో ఉన్న ఖాళీ స్థలంలో మహిళల ట్రైనింగ్ సెంటర్, అంగన్వాడీ సెంటర్ నిర్వహించుకునేందుకు మరో సామాజిక భవనం నిర్మించాలని కోరుతూ భరత్నగర్ మాదిగ సంఘం కమిటీ సభ్యులు ఆదివారం స్థానిక కార్పొరేటర్ పద్మ వెంకటరెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ భరత్నగర్ మాదిక సంఘం కమిటీ ప్రతినిధుల ప్రతిపాదనలను జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి త్వరలో భవన నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో భరత్నగర్ మాదిగ సంఘం కమిటీ సభ్యులు ఎన్.శ్రీహరి, ఇ.శ్యామ్రావు, ఇ.ఎస్.ధనుంజయ, ఎం.శ్రీనివాస్, ఎం.సదానంద్, ఇ.అజరు కుమార్ పాల్గొన్నారు.