Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
తాగునీటి బిల్లుల సమస్యలు పరిష్కరించాలని మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రావణ్ కుమార్ కోరారు. ఈమేరకు మంగళవారం వాటర్ వర్క్స్ జనరల్ మేనేజర్ను కలిసి పెనాల్టీలను రద్దుచేసి, పాడైపోయిన బోర్వెల్లను మరమ్మతులు చేయించాలని వివరించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతి ఇంటికి 20 వేల లీటర్ల ఉచిత నీటిని అందిస్తామని ప్రకటించి, ఆరు నెలల తర్వాత ఒకేసారి వేలకు వేల బిల్లులు కట్టండి అని బిల్లులు పంపడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. బిల్లుల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేయాలని ఆయన అధికారులను కోరారు. కార్యక్రమంలో డీజీఎం భాస్కర్, మేనేజర్ శ్రావణి, నవీన్ స్థానికులు శివ గౌడ్, శ్రీనివాస్, నరేష్ పాల్గొన్నారు.