Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జూబ్లీహిల్స్
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆదేశాల మేరకు బుధవారం యూసుఫ్ గూడ సర్కిల్ 19, జీహెచ్ఎంసీ ఆఫీసులో మహిళా గ్రూపు సభ్యులతో కార్పొరేటర్ రాజ్కుమార్ పటేల్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతీ సభ్యురాలు యూసుఫ్ గూడ డివిజన్లోని ప్రతిఒక్క ఇంటి వద్దకువెళ్లి వ్యాక్సిన్ వేయించాలని, అదేవిధంగా జ్వరం, ఇతర రోగాలతో బాధపడుతున్న వారిని గుర్తించి, వెంటనే దగ్గర్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాలని, డివిజన్లోని ప్రజలకు అన్ని సహాయ సహకారాలు అందించాలని, మహిళలను కోరారు.