Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్ మెట్
పేద, మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో రుణాలు అందించేందుకు ఐఐఎఫ్ఎల్ గోల్డ్ లోన్ ఉపయోగపడుతుందని ఎంపీపీ బుర్ర రేఖ మహేందర్ అన్నారు. శుక్రవారం అబ్దుల్లాపూర్ మెట్ మండల కేంద్రంలో ఐఐఎఫ్ఎల్ గోల్డ్ లోన్ నూతన బ్రాంచ్ ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ నగర ప్రాంతానికి శివారులో ఉన్న అబ్దుల్లాపూర్ మెట్ మండల ప్రజలకు గోల్డ్ లోన్ పొందేందుకు ఈబ్రాంచ్ ఉపయోగపడుతుందని, రుణాలు అవసరమున్న ప్రతి ఒక్కరూ ఈఅవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ బింగి దాస్గౌడ్, సర్పంచ్ కిరణ్ కుమార్ గౌడ్, ఉప సర్పంచ్ కావ్య శివ శంకర్ గౌడ్, కోఆప్షన్ సభ్యులు మహమ్మద్ గౌస్ పాషా, ఐఐఎఫ్ఎల్ బ్రాంచ్ మేనేజర్ శేఖర్, గ్రామ వార్డు సభ్యులు, బ్రాంచ్ సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.