Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ 7వ డివిజన్ పరిధిలోని శ్రీనివాస్ నగర్ కాలనీ పార్క్లో ఏర్పాటు చేసిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా వార్డ్ కమిటీ సమీక్ష సమావేశంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కేపీ వివేకానందగౌడ్, మేయర్ కోలన్ నీలాగోపాల్ రెడ్డి, డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, కమిషనర్ గోపి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డివిజన్ పరిధిలోని కాలనీలలో స్థానికంగా నెలకొన్న పలు సమస్యలను కాలనీ కమిటీ సభ్యుల ద్వారా తెలుసుకొని సమస్యల పరిష్కారానికి ఎల్లపుడూ కషి చేస్తామని తెలిపారు. 7వ విడత తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా పలు మొక్కలు నాటడం జరిగింది. ఈ మేరకు ప్రతి ఇంటికీి ఆరు మొక్కలు నాటి వాటిని ఎప్పటికప్పుడు సంరక్షించుకోవాలి అని సూచించారు. ఈ కార్యక్రమంలో 7వ డివిజన్ కార్పొరేటర్ ప్రణయ ధనరాజ్ యాదవ్ కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, సీనియర్ నాయకులు, యువ నాయకులు, మహిళా నాయకులు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, ఎలక్ట్రికల్, ఇతర ముఖ్య అధికారులు, వార్డు స్పెషల్ ఆఫీసర్లు కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.