Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఏఎస్రావునగర్
ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి చొరవతో చర్లపల్లి భరత్నగర్ ఆర్ఓబి పనులు మంగళవారం ప్రారంభం అయ్యాయి. దీంతో స్థానికులు, కార్మికులు, పారిశ్రామికవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిధుల లేమితో పనులు నిలిచిపోయిన విషయాన్ని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి ఇటీవల మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కేటీఆర్ మొదటి విడతగా రూ. 56 లక్షలు మంజూరు చేయించారు. గతంలో సుమారు రూ.కోట్ల నిధులతో చర్లపల్లి వైపుగా చేపట్టిన బ్రిడ్జి పనులు చివరిదశకు చేరుకున్నాయి. చర్లపల్లి కాలనీల సమాఖ్య ప్రతినిధి ఎంపల్లి పద్మా రెడ్డి, టీఆర్ఎస్ స్థానిక నాయకులు డప్పు గిరిబాబు మాట్లాడుతూ బ్రిడ్జి నిర్మాణం పనులు త్వరితగతిన పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు కర్రె సత్యనారాయణ, రెడ్యానాయక్, తూర్పాటి హనుమంతు, భరత్నగర్ వాసులు మార్కు, షరీఫ్ పాల్గొన్నారు.