Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 84 భవనాల ఖాళీ చేయించిన అధికారులు
- నగరవాసులు సహకరించాలి : జీహెచ్ఎంసీ కమిషనర్
నవతెలంగాణ-సిటీబ్యూరో
వర్షాకాలం నేపథ్యంలో ప్రమాదకరంగా మారిన 610 శిథిల భవనాలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. 84 భవనాలను మరమ్మతు చేసేందుకు ఖాళీ చేయించారు. ఇటీవల చేపట్టిన సర్వేద్వారా టౌన్ప్లానింగ్, ఇంజినీరింగ్ అధికారులు శిథిల భవనాలను గుర్తించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలు ఉన్నాయి. వీటిలో పాతభవనాలు హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లోనే ఎక్కువగా ఉన్నాయి. సికింద్రాబాద్లో జోన్లో 70, చార్మినార్ జోన్లో 55, శేరిలింగంపల్లిలో 3 శిథిల భనాలున్నాయి. కాగా సికింద్రాబాద్ జోన్ తుకారాంగేట్ ప్రాంతంలో ఒక్కరోజులోనే 29 భవనాలను కూల్చేశారు.
అది నిరంతర ప్రక్రియ
వర్షాల నేపథ్యంలో శిథిలావస్థ భవనాల సర్వే, కూల్చివేతలు, మరమ్మతులకు సంబంధించిన యాక్షన్ప్లాన్ అమలు వేగవంతం చేశాం. కూల్చివేతల ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుంది.శిథిల భవనాల కూల్చివేతలో నగరవాసులు జీహెచ్ఎంసీకి సహకరించాలి