Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
ఇంట్లో ఎవరి చెప్పకుండా బయటకు వెళ్లిన ఓ యువతి అదృశ్యమైన సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గాజులరామారం మహదేవ్పురం ఏరియాకు చెందిన నర్సింహులు, జయలక్ష్మీలకు నలుగురు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. అయితే ఈ నెల 1వ తేదీన చిన్న కూతురు కృష్ణవేణి ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు చుట్టూపక్కలా వెతికిన ఆచూకీ లభించకపొవడంతో సోమవారం తల్లి జయలక్ష్మీ జగద్గిరిగుట్ట పోలీసులను ఆశ్రయించింది. గద్వాల్ జిల్లాకు చెందిన నరేందర్పై అనుమానం ఉన్నట్లు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు