Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేటర్ నార్నే శ్రీనివాస్
నవతెలంగాణ-కూకట్పల్లి
హైదర్నగర్ను ఆదర్శవంతమైన డివిజన్గా తీర్చిదిద్దుతానని కార్పొరేటర్ నార్నే శ్రీనివాస్
అన్నారు. మంగళవారం డివిజన్ పరిధిలోని అల్లాపూర్ సొసైటీ నుంచి శుభోదయ కాలనీ మీదుగా ఆదిత్య నగర్లో నిర్మిస్తున్న సీవరేజీ పైప్లైన్ పనులను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరితగతిన సీవరేజ్ ఫిల్టర్ పైప్లైన్ పనులు పూర్తి చేసి, ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని మున్సిపల్ సిబ్బందికి సూచించారు. హైదర్నగర్ డివిజన్ అభివద్ధికి శాయశక్తులా కషి చేస్తానన్నారు. మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కషి చేస్తానన్నారు. కార్యక్రమంలో మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, జీహెచ్ఎంసీ వర్క్ఇన్స్పెక్టర్ మహదేవ్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.