Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
కాలనీ అభివృద్ధికి తనవంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. కుత్బుల్లాపూర్ డివిజన్ సంజీవయ్యనగర్లో సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.37 లక్షల నిధులు మంజూరైన సందర్భంగా కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ గురువారం ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ను ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ప్రతి కాలనీ అభివృద్ధే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు యాదగిరి, ప్రధాన కార్యదర్శి ఆర్.భిక్షపతి, ఉమామహేష్, రాంమూర్తి, ఏసురత్నం తదితరులు పాల్గొన్నారు.