Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ధూల్పేట్
బజాజ్ పల్సర్ వినియోగదారుల మనసులో చెరగని ముద్ర వేసుకుని తనదైన శైలిలో ఆకట్టుకుంటుందని బహదూర్పుర బ్రాంచ్ మేనేజర్ అమీర్ భాష, గ్యాస్ అధికారి నస్రత్ అలీ పేర్కొన్నారు. బజార్పల్సర్ 20 వసంతాల సందర్భంగా సోమవారం బహదూర్ పుర శ్రీసిద్ధి వినాయక బజాజ్ మోటార్స్ షో రూమ్లో సంబురాలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ బజాజ్ పల్సర్ ఇప్పటివరకు వినియోగదారులకు ఆకర్షణీయంగా నిలిచిందని, వాహనాలను టెక్నాలజీకి అనుగుణంగా రూపొంస్తున్నామన్నారు. శ్రీ సిద్ధి వినాయక బజాజ్ షోరూమ్ మోటార్స్ అధినేత బాబుల్ రెడ్డిి, బ్రాంచ్ మేనేజర్ ఏ సంతోష్ మాట్లాడుతూ బజాజ్ ప్రపంచవ్యాప్తంగా 70 దేశాలలో వినియోగదాలను విశేషంగా ఆకట్టుకుంటుందన్నారు. పల్సర్ విడుదలైన ఈ 20 ఏండ్లలో దేశపు నెం. 1 స్పోర్ట్స్ బైక్గా నిలిచిందన్నారు. ప్రతీ పల్సర్ కొనుగోలుపై 3వేల ఆఫర్ను ప్రకటించిందని, ఈ అవకాశాన్ని వినియోగదారులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.