Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
ఓ మహిళ గర్భాశయం నుంచి 3 కేజీల ట్యూమర్ను విజయవంతంగా తొలగించామని రెనోవా ఆస్పత్రి గైనకాలజిస్టు డాక్టర్ రాజశ్రీ తెలిపారు. ఈమేరకు సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు. గుంటూరు జిల్లాకు చెందిన ఓ ప్రయివేట్ స్కూల్ టీచర్ 15 ఏండ్ల క్రితం గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కు చికిత్స తీసుకుంది. అయితే ఇటీవల ఆమె కడుపులో విపరీతమైన నొప్పి, ఉబ్బి పోయిన కడుపు, వెన్నుముక నొప్పి తదితర లక్షణాలతో రెనోవా ఆస్పత్రిని సంప్రదించారు. కాగా సదరురోగికి ఎంఆర్ఐ, సీటీ పరీక్షలు నిర్వహించగా గర్భాశయంలో అతి పెద్ద ట్యూమర్ ఉన్నట్లు గుర్తించారు. వైద్య బందం డా. సంజరు, ఆంకో సర్జన్, డా. రాజశ్రీ, గైనకాలజిస్టుల నేతత్వంలో విజయవంతంగా శస్త్ర చికిత్స నిర్వహించి గర్భాశయంతో పాటూ కణజాలంలోనికి చొచ్చుకు పోయిన 3కేజీల ట్యూమర్ అవశేషాలతో సహా తొలగించారు. ఇలాంటి అరుదైన పరిస్థితుల్లో ఉన్న రోగులు అన్ని సదుపాయాలను కలిగిన హాస్పిటళ్లలోని వైద్యులను సంప్రదిస్తే ప్రమాదం నుంచి వారిని కాపాడవచ్చని వైద్య నిపుణులు సూచించారు.