Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
సంక్షేమ సంఘాలు అభివృద్ధికి పాటుపడాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని మాణిక్యనగర్ రెసిడెన్షీయల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా సోమవారం చింతల్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. సభ్యులంతా ఐకమత్యంతో సమస్యలను తన దృష్టికి తీసుకవచ్చి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ప్రతి కాలనీలో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ కాలనీలను అన్ని రంగాల్లో అభివృద్ధి పర్చడమే ధ్యేయంగా పని చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు సోమేష్యాదవ్, కాలనీ అధ్యక్షులు నాగార్జున గౌడ్, ప్రధాన కార్యదర్శి ఎస్.కె.ఖలీల్, వర్కింగ్ ప్రెసిడెంట్లు తోట కిరణ్కుమార్, బి.మహేష్, ఉపాధ్యక్షులు ఎం.రాజేష్, సత్య శ్రవణ్, కోశాధికారి సతీష్కుమార్, కాలనీ వాసులు కేబీఆర్ ప్రసాద్, కె.రఘునాథరెడ్డి, వెంకటేష్గుప్త, రఘు, కరుణ, రాజు, శ్రీనివాస్గౌడ్, సాయిచరణ్, గోపాల్, భాను ప్రకాష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.