Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు ఆశాలత
నవతెలంగాణ-సిటీబ్యూరో
ధరల నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని, పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచి పేదలపై భారాలు మోపుతున్నాయని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర అధ్యక్షులు ఆశాలత అన్నారు. సికింద్రాబాద్ జోన్ 13వ మహాసభలు సోమవారం అడ్డగుట్టలో జరిగాయి. ఈ సందర్భంగా ఆశాలత మాట్లాడుతూ.. ఎన్నికల ముందు అన్ని రకాల అభివృద్ధికి హామీలు ఇచ్చి, ఎన్నికలు అయిపోగానే, ప్రజల నెత్తిన బండరాళ్లు వేసినట్టు ధరలు పెంచడం, నిరుద్యోగులుగా మార్చడం శోచనీయమన్నారు. కరోనా సమయంలో ప్రజలను ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలు, పెట్టుబడి దారులకు వేలకోట్ల రాయితీలు ఇచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శి ఆర్.అరుణజ్యోతి తదితరులు పాల్గొన్నారు.
సికింద్రాబాద్ నూతన జోన్ కమిటీ ఎన్నిక
మహాసభల్లో జోన్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. కమిటీ గౌరవాధ్యక్షురాలుగా ఆర్.వీరలక్ష్మి, అధ్యక్షురాలుగా పద్మ, కార్యదర్శిగా ఎం.స్వరూపలను ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా ఆర్.అంజమ్మ, పి.శాంత, పి.నిర్మల, సి.హెచ్. వసంత, సహాయ కార్యదర్శిగా ఎస్.లలిత, పి.కౌసల్య, ఎం.భాగ్య, సునంద, ఎం.అలేఖ్య, సరోజమ్మ, ఆర్.లక్ష్మి, సమీమ్, ఎన్.రమలను ఎన్నుకున్నారు.