Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
ప్రేరణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా సోమవారం చర్లపల్లిలోని అంగన్వాడీ సెంటర్లో అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫౌండేషన్ వ్యవస్థాకులు శరత్ సుదర్శి మాట్లాడుతూ.. తల్లి పాలు బిడ్డకు అమృతం లాంటివని, పిల్లలు ఆరోగ్యం గా పెరగాలంటే తల్లి పాలు పట్టడం ఎంతో ముఖ్యమని అన్నారు. కరోనా వైరస్తో పోరాడే శక్తి కూడా పసి పిల్లలకు తల్లిపాల నుంచి లభిస్తుందన్నారు. ఫౌండేషన్ సభ్యురాలు టాన్య మాట్లాడుతూ.. పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగడానికి తల్లిపాలకు మించిన మరో మంచి ఆహారం లేదన్నారు. కాబట్టి ప్రతి తల్లి ఆరు నెలల పాటు బిడ్డకు కచ్చితంగా పాలు పట్టాలన్నారు. బిడ్డకు సరిపడా పాలు రావాలంటే తల్లి పోషకాహారం తీసుకోవాలని, అందుకే ప్రేరణ ఆధ్వర్యంలో బాలింతలకు బ్రెడ్డు, పండ్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. సహకరించిన దాతలకు ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో సౌజన్య, ప్రవీణ్ కుమార్, అంగన్వాడీ టీచర్లు రాధ, జవేరియా తదితరులు పాల్గొన్నారు.