Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: టీఎన్జీవోస్ యూనియన్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్. ఏస్. ఎమ్. హుస్సేని (ముజీబ్) ఆధ్వర్యంలో తెలంగాణ హోంశాఖ మంత్రివర్యులు మహమ్మద్ మహమూద్ ఆలి మర్యాదపూర్వకంగా జిల్లా సభ్యులతో కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు ముజీబ్ మాట్లాడుతూ మంత్రి హస్తం ఎల్లపుడు జిల్లాపై ఉనందుకు కృతజ్ఞత వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో టీఎన్జీవో యూనియన్ ఎల్లప్పుడూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో తమ వంతు కృషి చేస్తామని అని తెలిపారు. మంత్రి మహమ్మద్ మహమూద్ ఆలి మాట్లాడుతూ యూనియన్ ఉద్యోగులు ప్రభుత్వంలో ఒక భాగం అని అన్నారు. కార్యదర్శి యస్.విక్రమ్ కుమార్, కోశాధికారి జె.బాలరాజ్, ఉపాధ్యక్షులు కె.ఆర్.రాజ్ కుమార్, ఉమర్ ఖాన్, సంయుక్త కార్యదర్శి ఖాలీద్ అహ్మద్, కె.హరిబాబు, ప్రచార కార్యదర్శి కుర్రాడి శ్రీనివాస్, కార్యనిర్వాహక కమిటీ సభ్యులు బి.శంకర్ ఇతర సభ్యులు పాల్గొన్నారు.