Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ధర్మానాయక్
నవతెలంగాణ - మలక్పేట్
హైదరాబాద్ నగరంలోని మురికి వాడల్లో నివసించే అర్హులైన గిరిజనులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని, కరోనా కాలంలోఉపాధి లేక ఆర్ధిక ఇబ్బందులకు గురైన ఆటో కార్మికులకు ఉచితంగా లక్ష రూపాయల ఆర్ధిక పరిహారం ఇవ్వాలని ధర్మానాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఎన్టీఆర్ నగర్లో జరిగిన ప్రపంచ గిరిజన హక్కుల దినోత్సవం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలోని వివిధ మురికి వాడల్లో నివసిస్తున్న గిరిజనుల బాగోగులను పట్టించుకునేవారే లేరని, గిరిజనులను కేవలం ఓటు వేసే యంత్రాలుగానే పాలకులు ఉపయోగించుకుంటున్నారని అన్నారు. సొంతగ్రామాలను వదిలి బతుకు దెరువు కోసం పట్నానికి వచ్చి ముప్పైఏండ్లు దాటినా ఇక్కడి గిరిజనుల జీవితాల్లో మార్పులు రాలేదన్నారు. స్వతంత్రం వచ్చి 75సంవత్సరాలు అవుతున్నా పేదలు గిరిజనులు ఉండే మురికివాడల్లో మంచినీరు, డ్రయినేజీ, విద్య, వైద్యం, ఉపాధి లాంటివి అందడం లేదని ఆవేదన వ్యక్తం చేసారు.రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా ఉచిత విద్య, వైద్యం, ఉద్యోగాలు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందించాలని, జనాభా ప్రకారం 10శాతం రిజర్వేషన్ అమలు చేయాలని, తెలంగాణ ప్రభుత్వం దళిత బంధు ఇస్తున్నట్లు గిరిజనులు వారి అభివద్ధికి గిరిజన బంధును ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్.పాండు నాయక్, రంగారెడ్డి జిల్లా నాయకులు యం.గోపినాయక్, యం లక్ష్మన్ నాయక్, బంజారా సేవాసంఘం అధ్యక్షులు సబావత్ బిచ్య నాయక్, బాలు నాయక్, సువాలీబాయి,ప్రేమ్ నాయక్, రవి, పాండు పాల్గొన్నారు.