Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
వ్యవసాయ మార్కెట్లో రామలీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం నాడు మార్కెట్ చైర్మన్ శ్రీధర్ శ్రీనివాస్కు వినతి పత్రాన్ని అందజేశారు. హమాలీల బస్తాల రేటు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి పెంచాల్సి ఉండగా నాలుగు సంవత్సరాలు అవుతున్నప్పటికీ పెంపుదల జరగడం లేదని, గత రెండు సంవత్సరాలుగా కరోనా ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సైతం మార్కెట్ విధులు నిర్వహించిన కార్మికులకు హమాలీ రేట్లు పెంచి న్యాయం చేయాలని కోరారు. బోయిన్పల్లి మార్కెట్ హమాలీ యూనియన్ ఆధ్వర్యంలో హమాలీ యూనియన్ అధ్యక్షులు ఎంనర్సింహా మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్ ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయని, తద్వారా హమాలీల జీవనంపై అధిక భారం పడుతున్నదని, రెండు సంవత్సరాలకు పెంచాల్సిన రేట్లు నాలుగు సంవత్సరాలైనా పెంచకపోవడంతో వారికి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని కాబట్టి వెంటనే రేట్లను పెంచాలని వారు కోరారు. ఈ సందర్భంగా బోయిన్పల్లి మార్కెట్ చైర్మన్ టీఎన్ శ్రీధరన్ శ్రీనివాస్ మాట్లాడుతూ సాధ్యమైనంత త్వరలో కలెక్టర్తో చర్చించి రైతులతో వ్యాపారస్తు లతో హమాలీలతో జాయింట్ సమావేశం ఏర్పాటుచేసి హమాలీల రేట్లను పెంచేందుకు కషి చేస్తానని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హమాలీ యూనియన్ నాయకులు ఎన్.ఎల్లయ్య, డి.ఐలయ్య, కోట కొమురయ్య, ఏ. గట్టయ్య, బి. సమ్మయ్య, పి.రాజు, కుమార్ తదితరులు పాల్గొన్నారు