Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఉప్పల్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందని, అందులో భాగంగానే గత మూడు సంవత్సరాలుగా దాదాపు 3వేల కోట్లకు పైచిలుకు ఫీజు రీయంబర్స్మెంట్ విడుదల చేయలేదని ఎస్ఎఫ్ఐ ఉప్పల్ నియోజకవర్గ అధ్యక్షులు ఖాసిం మండిపడ్డారు. మంగళవారం నాడు ఉప్పల్ బీరప్పగడ్డ సర్కిల్లో ఎస్ఎఫ్ఐ నాయకులతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగినా కానీ విద్యార్థులకు ఇచ్చే మెస్ చార్జీలు ధరలను పెంచలేదు. కేటాయించిన నిధులను సైతం విడుదల చేయకపోవడం విడ్డూరం. వెంటనే గత బకాయి ఫీజులు మొత్తం చెల్లించాలని, లేకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున విద్యార్థి ఉద్యమం చేపడతామని ఆయన హెచ్చరించారు. అలాగే విద్యా సంవత్సరం ప్రారంభంపై కూడా స్ఫష్టత ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి మద్దతుగా మహిళా సంఘం నాయకురాలు వినోద, సుగుణ, ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి మణికంఠ, హరీష్, తారకరత్న పాల్గొన్నారు