Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అల్వాల్
అల్వాల్ పట్టణ కేంద్రంలోని కూకట్పల్లి జోనల్ కమిషనర్ మమత అల్వాల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ నాగమణి అధికారులతో సుడిగాలి పర్యటన చేశారు. జోనల్ కమిషనర్ మాట్లాడుతూ కొత్తచెరువు వినాయక నిమజ్జన ఘాటును పరిశీలిం చారు. రెండు రోజుల్లో నిమజ్జన కొలను శుభ్రపరిచి పరిసర ప్రాంతాలను చెత్తాచెదారంలేకుండా చూడా లని అధికారులను ఆదేశించారు. కొత్తచెరువులోని గుర్రపుడెక్క తొలగించి, దోమల బెడద నుండి ప్రజలకు విముక్తి కలిగిందని ఆమె పేర్కొన్నారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజు, డీఈలు మహేష్, కార్తిక్, ఏఈలు లక్ష్మి, అరుణ్, రవళి, ఏఏంహెచ్ఓ నిర్మల, మున్సిపల్ సిబ్బంది పాల్గొ న్నారు. బందావన్ కాలనీ నుండి ఐస్ ఫ్యాక్టరీ వరకు అధికారులతో పరిశీలించారు. వెంకటాపురం డివిజన్లోని డంపింగ్ వ్యవస్థను రవాణా చేసే వాహనాల పనితీరును కార్మికులను అడిగి తెలుసుకున్నారు. వెంకటాపురం, ఇందిరానగర్లోని మొబైల్ వ్యాక్సిన్ సెంటర్ను పరిశీలించారు.