Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఉప్పల్
చిల్కానగర్ డివిజన్లోని కళ్యాణ్పురి సామాజిక భవనంలో చిల్కానగర్ కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలను మంగళవారం వైభవంగా నిర్వహించారు. చిల్కానగర్ డివిజన్ పరిధిలోని అంగన్వాడీ సీడీపీఓ స్వాతి, సూపర్వైజర్ పార్వతి, అంగన్వాడి కేంద్రాల టీచర్ల నేతత్వంలో గర్భిణీ స్త్రీలకు తల్లిపాల ఆవశ్యకత గురించి అవగాహన కలిగించారు. అప్పుడే పుట్టిన బిడ్డకు ముర్రు పాలను తాగించాలి అని సూచించారు, చిన్నారులకు అవి చాలా శ్రేష్ఠమైనవి అని తెలిపారు. పుట్టినప్పటి నుంచి ఆరు నెలల వరకు చంటి పిల్లలకు తల్లిపాలు తాగించాలి అని వివరించారు. చిల్కానగర్ డివిజన్లోని 25 మంది గర్భిణీలకు కన్నులపండు వగా శ్రీమంతం కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీమంత వేడుకలను చూసిన మహిళలు ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్ర మంలో డివిజన్ అధ్యక్షులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, మంజుల, టీిఆర్ఎస్ సీనియర్ నాయకులు వీబీ నరసింహ, కొండల్ రెడ్డి రామానుజం, కోకొండ జగన్, మాస శేఖర్, బింగి శ్రీనివాస్, బాలు, శ్యాం, శ్రీకాంత్, మరియు అంగన్వాడీ టీచర్లు ఆయాలు మొదలగు వారు పాల్గొన్నారు.