Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేపీహెచ్బీ
గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం ద్వారా వికలాంగులకు త్రిచక్రవాహనాలను అందించడంతో జీవనోపాధి కలిగేలా ఉపయోగపడుతుందని అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ అన్నారు. రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కెేటీఆర్ జన్మదిన వేడుకలకు బదులుగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృషారావు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ల సహకారంతో వికలాంగులకు అందించిన ట్రై మోటార్ సైకిళ్లను కార్పొరేటర్ వాహన పూజ చేయించారు. కార్యక్రమంలో డివిజన్ కోఅర్డినేటర్ వీరారెడ్డి, పిల్లి తిరుపతి, ఎస్సి సెల్ అధ్యక్షులు జ్ఞానేశ్వర్, జగన్నాథం, రవీందర్రెడ్డి, మొయిజా, హమీద్, సలీం, అస్లాం, కేశవ, రేవతి, లక్ష్మీ, తాజ్బి, రావు తదితరులు పాల్గొన్నారు.