Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అల్లాపూర్ కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్
నవతెలంగాణ-కేపీహెచ్బీ
ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతతో వ్యాక్సిన్ తీసుకో వాలని అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబిహా గౌసు ద్దీన్ అన్నారు. మంగళవారం అల్లాపూర్ డివిజన్ పరిధి లోని సఫ్టర్నగర్లో నూతన కోవిడ్ వ్యాక్సిన్ సెంటర్ ను మేడ్చల్ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ గౌసుద్దీన్, పారిశుధ్య శాఖ అధికారులతో కలిసి ప్రారం భించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ డివిజన్ ప్రజలకు కోవిడ్ వ్యాక్సిన్ సెంటర్ అందు బాటులో ఉండాలనే నూతన వ్యాక్సిన్ సెంటర్ను ప్రారంభించామన్నారు. ప్రతి విషయంలోనూ ఎంత గానో సహకరిస్తున్న కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్ర మంలో కోఆర్టినేటర్ వీరారెడ్డి, హమీద్, జ్ఞానేశ్వర్, సయ్యద్ రియాజ్, సలీమ్, రఫీక్, రుబిన, తాజ్బీ తదితరులు పాల్గొన్నారు.