Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తల్లి, శిశువును కాపాడిన కామినేని డాక్టర్లు
నవతెలంగాణ-సుల్తాన్బజార్
మాయ (ప్లాసెంటా) కారణంగా తల్లి గర్భాశయ ద్వారం మూసుకుపోయి ప్రసవానికి ఇబ్బందిపడుతున్న ఓ మహిళకు కామినేని హాస్పిటల్ వైద్యులు సిజేరియన్ హిస్టొరెక్టరమీ అనే సంక్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తిచేశారు. ఈమేరకు మంగళవారం బొగ్గులకుంటలోని కామినేని ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డాక్టర్లు ఏ ప్రసన్న లత, ఆర్వీ సౌజన్య, గాయత్రి వివరాలు వెల్లడించారు. 28ఏండ్ల ఓ మహిళలకు గర్భాశయంలో ఏర్పడిన మాయ (ప్లాసెంటా) సమస్యతో గర్భాశయ మార్గం(సెర్విక్స్) మూసుకుపోయింది. అల్ట్రాసౌండ్, ఎమ్ఆర్ఐ పరీక్షలు చేయగా ఆమె ప్లాసెంటా పెర్క్రిటాతో బాధపడుతున్నట్లు గుర్తించారు. సమస్య మరింత జఠిలంగా మారడంతో శిశువు ప్రసవానికి ఆటంకంతో వారి ఇద్దరి ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశం ఏర్పడింది. దీంతో ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ఎ ప్రసన్నలత నేతృత్వంలో కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ నియోనాటాలజిస్ట్ డాక్టర్ ఆర్వీ సౌజన్య ఇతర వైద్య బృందంతో కలిసి సర్జరీ చేసి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న తల్లి, బిడ్డ ప్రాణాలను కాపాడామని తెలిపారు. ప్రతి 700 మంది గర్భిణీలలో ఒకరు ఇలాంటి సమస్యతో బాధపడుతుంటారని వివరించారు. క్లిష్టమైన ఆపరేషన్ను విజయవంతం చేసినందుకు రోగి భర్త పాండురంగం డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు.